ఖజ్రానా గణేష్ దేవాలయం

Sample Image

ఖజ్రానా వినాయక దేవాలయం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న వినాయకుడి దేవాలయం. ఈ దేవాలయం హోల్కర్ రాజవంశం పాలనలో నిర్మించబడింది.

హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.

చరిత్ర:

1735లో హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ దేవాలయాన్ని నిర్మించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి సురక్షితంగా ఉంచడానికి వినాయకుని విగ్రహాన్ని బావిలో దాచిపెట్టిన తరువాత వెలికితీయబడింది.భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలు నేరవేరాలని ఒక దారం కడతారు. దేవాలయంలోని పురాతన విగ్రహం స్థానిక పూజారి పండిట్ మంగళ్ భట్ కలలో కనిపించిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయాన్ని ఇప్పటికీ భట్ కుటుంబం నిర్వహిస్తోంది.

అభివృద్ధి:

చిన్న గుడి నుంచి ఆధునిక దేవాలయం వరకు ఏళ్లుగా ఇది అభివృద్ధి చెందింది. దేవాలయానికి విరాళాల రూపంలో డబ్బు, బంగారం, వజ్రాలు, ఇతర విలువైన ఆభరణాలు అందుతాయి. గర్భగృహ ద్వారం, బయటి, పై గోడలు వెండితో తయారు చేయబడ్డాయి. వాటిపై వివిధ పండుగల చిత్రాలు చెక్కబడ్డాయి. ఇండోర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త దానం చేసిన వజ్రాలతో దేవత కళ్ళు తయారు చేయబడ్డాయి.