తిరుపతి

Sample Image

తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

తిరుమల తిరుపతి చరిత్ర

అట్లీ శంకరాచార్యులు తిరుమల వద్దకు వచ్చి శ్రీ చక్రం వెంకటేశ్వర కమల పాదాల వద్ద ఉంచి ప్రసిద్ధ పాట-భాజా గోవిందం- పాడారు. పురాణాలు మరియు ఇతర గ్రంథంలోని వివిధ శ్లోకాల ప్రకారం: పరమాత్మ లేదా విష్ణువు. ఈ కలియుగం యొక్క నారాయణ లేదా బ్రాహ్మణ. తిరుపతికి సమీపంలో ఉన్న వెంకటేశ్వరుడు తన పవిత్ర నివాసం వెంకటమ్ కొండలలో ఉంది. కొండలను ఎక్కువగా తిరువెంకటం అని పిలుస్తారు). ఆ విధంగా వెంకటేశ్వర ప్రధాన ఆలయం తిరుమల వెంకటేశ్వర ఆలయం. తిరుమల ఆలయం. అక్కడ ఆయన ప్రధాన దేవత. ప్రపంచంలోని అన్ని దేవాలయాలలో అత్యంత ధనికమని నమ్ముతారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో చిత్తూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఏడు కొండల ఉనికి దేవతకు ప్రత్యామ్నాయ పేర్లను ప్రభావితం చేసింది: తెలుగులో ఎడుకొండలవాడు మరియు తమిళంలో ఎజుమలైయన్. ఈ రెండింటి అర్ధం – ఏడు కొండల ప్రభువు.

అతన్ని మాల్, తిరుమాల్, మణివన్నన్, బాలాజీ (ఇది ఇటీవలి పేరు అయినప్పటికీ), శ్రీనివాస అని కూడా పిలుస్తారు. వెంకటేశ, వెంకటనాథ, తిరువెంగడం ఉదైయాన్, తిరువెంగదత్తన్ మరియు అనేక ఇతర పేర్లతో. సాంప్రదాయకంగా శివ ఆరాధించే వర్గాలు ఆయనను కర్ణాటక అంతటా తిరుపతి తిమ్మప్ప అనే పేరుతో పూజిస్తారు. హిందూ మతంలో వెంకటేశ్వర్ లేదా వెంకటచలపతి విష్ణువు యొక్క చాలా ఆరాధించే రూపం అని కూడా పిలుస్తారు. అతన్ని బాలాజీ లేదా లార్డ్ వెంకటేశ్వర అని కూడా పిలుస్తారు. సాంప్రదాయకంగా శివుడు ఆరాధించే వర్గాలు ఆయనను కర్ణాటక అంతటా తిరుపతి తిమ్మప్ప అనే పేరుతో పూజిస్తారు. తిరుమల ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వరుడు ప్రధాన దేవత, ఇది ప్రపంచంలోని అన్ని హిందూ పుణ్యక్షేత్రాలలో అత్యంత ధనవంతుడని నమ్ముతారు.

వెంకటేశ్వర స్వామి ఆలయం చిత్తూరు జిల్లాలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఇది చెన్నై నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడు కొండల ఉనికి దేవతకు ప్రత్యామ్నాయ పేర్లను ప్రభావితం చేసింది: తెలుగులో ఎడుకొండలవాడు మరియు తమిళంలో ఎజుమలైయన్. ఈ రెండూ ఏడు కొండల ప్రభువు అని అర్ధం. ఐకానోగ్రాఫిక్ వర్ణనలలో. లార్డ్ వెంకటేశ్వర కళ్ళు కప్పబడి ఉన్నాయి ఎందుకంటే అతని చూపు చాలా తీవ్రంగా ఉందని చెప్పబడింది, అది విశ్వాన్ని కాల్చివేస్తుంది.

తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని 10 నమ్మలేని నిజాలు

1. ఎవరికీ తెలియని రహస్య గ్రామం:

తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు, తదితర ఎన్నో పదార్ధాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు.

2. శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు:

తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడి వైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది.

3. శ్రీవారికి నిజమైన జుట్టు:

వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కధ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీల దేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తి సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తరువాత స్వామి వారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది.

4. విగ్రహం వెనుక సముద్ర ఘోష:

శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామి వారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు.

5. కొండెక్కని దీపాలు:

గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామి వారి ఎదుట కనిపిస్తాయి.

6. నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు:

చాలా కాలం క్రితం 19వ శతాబ్ధంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణ శిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకూ ఉరి తీయాలని ఆదేశిస్తాడు. మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామి వారు నిజ రూపంలో కనిపించినట్లు చెబుతారు.

7. విగ్రహ రహస్యం:

శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్ని సార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం.

8. గర్భగుడిలో పూజించిన పూలు వెర్పేడులో ప్రత్యక్షం:

తిరుమల వేంకటేశ్వరున్ని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామి వారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (శ్రీ కాళహస్తికి వెళ్లే దారి) లో కనిపిస్తాయి.

9. రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం:

ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏ మాత్రం చెక్కుచెదరక పోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు.

10. శ్రీవారికి చెమటలు:

తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారిన్ హీట్ తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామి వారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు.